ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రద్ధగా జరుపబడుతున్నాయి. పాడ్యమి మొదలు దశమి వరకు శ్రీ కామాక్షీ అమ్మవారికి - శ్రీ స్వర్ణ కవచాలంకార దుర్గా దేవి, శ్రీ బాలాత్రిపురసుందరి, శ్రీ గాయత్రీ దేవి, శ్రీ అన్నపూర్ణా దేవి , శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి, శ్రీ సరస్వతీ దేవి (మూల నక్షత్రమున ) , శ్రీ దుర్గా దేవి, శ్రీ మహిషాసురమర్ధినీ దేవి , శ్రీ రాజరాజేశ్వరీ దేవి గా అలంకారములు జరుప బడుతున్నాయి.
ప్రతీ రోజు అమ్మవారికి అభిషేకం, ఆ అవతారం నకు సంబందించిన అలంకారం, వివిధ స్తోత్ర పారాయణాలు, చండీ సప్తశతీ పారాయణము, చండీ పాఠ పారాయణ, భజనలు, జరుపబడుతున్నాయి.
మూల నక్షత్రమున, శ్రీ సరస్వతీ దేవి కి పిల్లలు, పెద్దలతో పుస్తక పూజ జరుపబడుతున్నాయి.
నవమి/దశమి నాడు చండీ హోమం, శమీ వృక్ష పూజ జరుపబడుతున్నాయి